నేడు దిల్సుఖ్నగర్ లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీరామదాసు రవి చారి

విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం,దిల్సుఖ్నగర్  ఆద్వర్యంలో అపోలో వారి సౌజన్యంతో దిల్షుక్నగర్ స్వర్ణకార వీధిలో  మూడవ సారి   నవంబర్ 26 న  శనివారం నాడు   ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శ్రీరామదాసు రవి చారి తెలిపారు   ,ఈ శిబిరంలో బి పి,  బాడీ  మాస్  ఇండెక్స్,  రండోమ్  బ్లడ్  షుగర్   ( ఆర్ బి ఎస్ )  ఈసీజీ,  జనరల్  ఫిజిషియన్  కన్సల్టెషన్,
డెంటల్  స్క్రీనింగ్, ఐ  స్క్రీనింగ్, హియరింగ్  టెస్ట్  స్క్రీనింగ్, పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా
ఎల్.బి నగర్ శాసనసబ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,
ప్రముఖ కార్డియాలజిస్ట్   అమరవాది ప్రభాకర చారి
గడ్డి అన్నారం డివిజన్ కార్పోరేటర్   బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి  లు ముఖ్య అతిథులుగా    విచ్చేయనున్నారని తెలిపారు. పట్టన ప్రజలు వివిద రకాల వృత్తిని నిర్వహిస్తూ ఆరోగ్యం విషయంలో దృష్టి మరల్చలేకపోతున్నారని
అలాంటి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంఘం ద్వారా ఈ ఆరొగ్య శిభిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందిని ఈ శిబిరంలో సాదారణ ఆరోగ్య పరీక్షలతో పాటు వైద్యుల సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం  చేసుకోవాలని కోరారు