నేడు దివ్యాంగులకు బస్ పాస్ల పంపిణీ
ఖమ్మం,మే28(జనం సాక్షి): ఈ నెల 29న మధిర మండలంలోని దివ్యాంగులకు 50 శాతం సబ్సీడీతో టీఎస్ఆర్టీసీ బస్పాస్లను అందించడం జరుగుతుందని ఐకేపీ ఏపీఎం బీరెల్లి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక వెలుగు మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి ఈ బస్సులను పంపిణీ చేస్తారని, 100 శాతం అంగవైకల్యం కలిగిన మూగ, చెవుడు, కంటిచూపు లేని వారు, 40 ఆర్ధో అంగవైకల్యం కలిగిన వారు అర్హులని తెలిపారు. దివ్యాంగులు తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, రూ.30 లతో హాజరుకావాలని కోరారు.