నేడు బీచుపల్లి పుణ్యక్షేత్రం లో సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 16 మండలం పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సోమవారం సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణానది సమీపాన శ్రీకోదండ రామస్వామి ఆలయంలో పునర్వాస నక్షత్రం సందర్భంగా సీతారాముల కళ్యాణం జరుగును. కావున మండలంలోని వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకంచి తీర్థ ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరారు.