నేడు విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి

గద్వాల నడిగడ్డ, జులై 19 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎం ఏ ఎల్ డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో బుధవారము విద్యాలయాలు బందు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని,కార్బోరేట్,ప్రవేట్,విద్యాసంస్థలలో అధిక ఫీజులను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాసంస్థల బంద్ కి పిలుపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్పొరేటు,ప్రయివేటు విద్యా సంస్థ లో ఫీజులు నియంత్రణ చేయాలని, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించి మౌళిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచర్,లెక్చరర్ పొస్ట్లు భర్తీ చేయాలని
డిమాండ్ లను సాధించుకోవడం కోసం ఈ నెల 20న రాష్ట్ర వ్యప్తంగా విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.
బంద్ కు జిల్లాలోని ప్రవేట్ విద్యాసంస్థల యజమాన్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థల బంద్ కు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా పంథా జిల్లా అధ్యక్షులు హాలీమ్ పాషా, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు వంశీ కుమార్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బత్తలయ్య,ఏ ఐ ఎస్ ఎఫ్ ప్రవీణ్ మురళి,మన్యం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.