నేత్రదానానికి ముందుకు వచ్చిన యువతకు ఐడీ కార్డులు అందజేత
యైటింక్లయిన్ కాలని ఆగస్టు 25(జనం సాక్షి):
జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల 25 ఆగస్ట్ నుండి 8 సెప్టెంబర్ వరకు జరగుతున్న సందర్బంగా ఆర్జి-2 ఎంసీటీసిలో ప్రారంభించి యువ సింగరేణి కార్మికులకు గురువారం సదాశయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అవగాహన కల్పించారు. వీటీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వీటీసీ మేనేజర్ రంగారెడ్డి హజరై డోనర్ కార్డులు అందజేసి మాట్లాడారు. కోట్ల రూపాయలు పెట్టిన దొరకని మానవ నేత్రాలను మరణాంతరం మట్టిలో వృదా పోనీయకుండా మరణాంతరం నేత్ర దానం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు మరణానంతరo నేత్ర దానం చేయడానికి 9492781306 కు సంప్రదించాలని కోరారు. ఈ సందర్బంగా 40 యువ సింగరేణియన్లు నేత్ర అవయవ దానం కు ముందుకు రాగా వారికి డోనర్ కార్డులు అందించడం జరిగింది. నేత్ర దానానికి ముందుకు వచ్చిన యువ ఉద్యోగులను ఆర్జీ-2 జనరల్ మేనేజర్ వేంకటేశ్వర రావు, ఎస్ఓటుజీఎం సాంబయ్య, డీజీఎం పర్సనల్ జీ. రాజేంద్ర ప్రసాద్,అధ్యక్షులు టీ. శ్రవణ్ కుమార్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో మహేష్, తిరుపతి యోగేష్ ప్రకాష్, నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు.