నేపాల్ లో ఘోర ప్రమాదం : 20 మంది మృతి

ఖాట్మండు : నేపాల్ లోని నువాకోట్ జిల్లాలోని జ్ఞాన్ ఫెడీ ఏరియాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ ట్రక్కు అదుపుతప్పి 500 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఖాట్మండు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో మొత్తం 40 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.