నేపాల్ లో భూకంపం..3,600 మంది మృతి..

నేపాల్ : భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మూడో రోజు కూడా కాట్మండులో భూప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు 3,600 మంది మృతి చెందారు. శిథిలాల కింద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయి. సుమారు 6,500 మందికి పైగా గాయపడ్డారు.