నేరెళ్ళ గ్రామం లో భర్తను చంపిన భార్య,అత్త..

ధర్మపురి (జనం సాక్షి) మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఆదివారం రోజున రాత్రి దాదాపు 08.00 గంటల నుండి 09.00 గంటల మధ్య నేరెళ్ల గ్రామానికి చెందిన దాసండ్ల మాణిక్యం, s/o భూమయ్య, వయస్సు 40 సం, కులం మాల అనే వ్యక్తిని తన భార్య అయిన దాసండ్ల జమున, వయస్సు 38 సం.లు మరియు జమున తల్లి అయిన నమిలికొండ శాంతవ్వ అను ఇద్దరు కలిసి జమున భర్త ఆయన దాసండ్ల మాణిక్యం ను కట్టెలతో తలమీద మరియు ఇతర శరీర భాగాల మీద విచక్షణ రహితంగా కొట్టగా తీవ్ర రక్త గాయాలై మాణిక్యం అక్కడికక్కడే చనిపోయినాడు, మృతస్థుడు మాణిక్యం తన భార్య దాసండ్ల జమునతో తరచు తన మీద అనుమానం పెట్టుకొని వేధిస్తున్నట్లు, అట్టి వేదింపులు భరించలేక జమున తన తల్లి తో కలిసి హత్య చేసినట్లు మృతుని తండ్రి దాసండ్ల భూమయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై మీడియా తెలిపారు.