నేర నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం
మేయర్ సామల బుచ్చిరెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ప్రతి కాలనీలో ఏర్పాటు చేసుకునేందుకు స్థానికులు, నాయకులు కృషి చేయాలని కోరారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్ లో గల శ్రీ సాయి రెసిడెన్సీలో స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల వ్యయంతో కాలనీవాసులు ఏర్పాటుచేసుకున్న సీసీ కెమెరాలను మేయర్ సామల బుచ్చిరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పెద్దఎత్తున స్పందన లభించిందని, యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మున్ముందు అన్ని కాలనీల్లో కచ్చితంగా కెమెరాలు ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, కో అప్షన్ సభ్యులు రంగ బ్రమ్మన్న గౌడ్, సిఐ గోవర్ధన్ గిరి, ఎస్సై సందీప్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Attachments area