న్నను హతమార్చిన తమ్ముడు – హత్యకు దారితీసిన భూ వివాదం

ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
రోజు రోజుకు మానవతా విలువలు మంటగలసి పోతున్నాయి.తల్లి,తండ్రి,అక్కా,చెల్లి,అన్నా,తమ్ముళ్ల మధ్య ఉన్న రక్త సంబంధాల విలువలు కనుమరుగై పోతున్నాయి.ఆస్తుల కోసం అయినవాళ్ళను అతి కిరాతకంగా అంతమొందించేందుకు సైతం వెనుకాడడం లేదు.ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా రగులుతున్న భూ వివాదం హత్యకు దారితీసింది.భూ పంపిణీలో చోటు చేసుకున్న ఘర్షణలో కోపోద్రిక్తుడైన తమ్ముడు అన్నను బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి ఖానాపూర్ గ్రామంలో గురువారం జరిగింది.స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నీరుడి పోచయ్య(55) నీరుడి శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములు అయితే గత కొంత కాలంగా భూ పంపిణీ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.ఇదే విషయమై ఇరువురి మధ్య జరిగిన వివాదం తీవ్ర రూపం దాల్చింది.మాటా మాటా‌ పెరిగి ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ అన్న పోచయ్య ను బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు.