న్యాయం చేయకపోతే సిఎం ఇంటిముందు ఆందోళన చేస్తాం: తమ్మినేని

వరంగల్ అర్బన్: రైతులకు న్యాయం చేయకపోతే సిఎం కేసీఆర్ ఇంటిముందు ఆందోళన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన ఎనుమాముల మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ ఉందని, తెలంగాణలో మార్కెట్ చైర్మన్లు, అధికారులు కుమ్ముక్కై రైతులను నష్ట పరుస్తున్నారన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.