న్యూగినియాలో భూకంపం 6.3గా నమోదైంది.

న్యూగినియా: పపువా న్యూగినియాలోని బోగన్‌విల్లె ద్వీపంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. పన్‌గునా నగరానికి 94కి.మీ. దూరాన, 30 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపారు.