న్యూజిలాండ్ అందాలను ఎంజాయ్ చేస్తున్న టీమిండియా సభ్యులు
న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి): న్యూజిలాండ్పై తొలి వన్డే గెలిచిన ఇండియన్ టీమ్ ఎంజాయింగ్ మూడ్లో ఉంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం మౌంట్ మాంగానుయ్లో జరగనుంది. దీంతో
గురువారం నేపియర్ నుంచి టీమ్ రోడ్డు మార్గంలోనే అక్కడికి వెళ్లింది. మధ్యమధ్యలో ఆగుతూ.. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తూ టీమ్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశాడు. కుల్దీప్తోపాటు ధోనీ, చాహల్, రాయుడు, కేదార్ జాదవ్ ఫొటోలకు పోజులిచ్చారు. నేపియర్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచిన విషయం తెలిసిందే. కుల్దీప్, షమి, చాహల్ బౌలింగ్లో రాణించగా.. బ్యాటింగ్లో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.