సబ్జెక్టు వారీ రిసోర్స్ పర్సన్ లకు తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించిన పర్యవేక్షణ పై అవగాహన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బహుళ తరగతి మరియు బహు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాట్లవాయి లో రాయికల్ మండలంలోని భూపతి పూర్, అల్లీ పూర్, తాట్లవాయి, రాయికల్ స్కూల్ కాంప్లెక్స్ లకు చెందిన సబ్జెక్టు వారీ రిసోర్స్ పర్సన్ లకు తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించిన పర్యవేక్షణ పై అవగాహన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బహుళ తరగతి మరియు బహుళ స్థాయి బోధన, బోధన ప్రణాళికల తయారీ, విద్యార్థుల ప్రగతిని యాప్ లో నమోదు చేయడం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మూలస్తం గంగాధర్, ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి సింగు సత్తయ్య, జిల్లా రిసోర్స్ పర్సన్ కడకుంట్ల అభయ్ రాజ్, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, శ్రీనివాస్, కామని లక్ష్మణ్, వెంకటయ్య, సీఆర్పీలు రవీందర్, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

తాజావార్తలు