పంచాయితీ ఎన్నికలకు దూరం: ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్,సెప్టెంబర్5(జనం సాక్షి): జమ్మూకశ్మీర్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ స్పష్టం చేసింది. 35ఏ ఆర్టికల్పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు.. పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటామనినేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. పంచాయతీ ఎన్నికల తర్వాతే ఆర్టికల్ 35ఏ గురించి తీర్పును వెల్లడిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదాస్పద ఆర్టికల్పై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసేంత వరకు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటామన్నారు.