పంద్రాగస్ట్‌ రోజే విషాదం

బహుమతి తీసుకుంటూ కుప్పకూలిన విద్యార్థిని

బాలిక మృతితో పాఠశాలలో విషాదం

వనపర్తి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్‌ మండలం సోలిపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న భవ్య స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందింది. పాఠశాలలో జెండా వందనం అనంతరం బహుమతి తీసుకుంటూ సొమ్మసిల్లి పడిపోయి…అక్కడికక్కడే మృతి చెందింది. భవ్య గత కొన్ని రోజులుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థిని మృతితో పాఠశాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో పంద్రాగస్ట్‌ వేడుకలను అర్థాంతరంగా ముగించారు. పాఠశాల విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె త్లలిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.