పట్టణాల అభివృద్ధి కి తెరాస ప్రభుత్వం ప్రత్యేక కృషి
జహీరాబాద్ జులై 21 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కొరకు టీఅర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు అన్నారు.జహీరాబాద్ పట్టణంలోని రాచన్నపేటలో 10 లక్షల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలను, పట్టణ ప్రగతితో పట్టణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పరుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాబోవు రోజుల్లో జహీరాబాద్ పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షలు సయ్యద్ మోహిఉద్దిన్, ఆత్మ కమిటీ ఛైర్మెన్ పెంటరెడ్డి, ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ లు మాంకల్ సుభాష్, మురళి కృష్ణ గౌడ్, తంజీమ్, ముత్యాల చందు, మాజీ కౌన్సలర్ లు నామ రవికిరణ్, మోతిరామ్, అబ్దుల్లా, వార్డు అద్యక్షులు నరేష్ రెడ్డీ, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ పట్టణ అద్యక్షులు మొహమ్మద్ యాకూబ్, సీనియర్ నాయకులు రంగ అరుణ్, వైజ్యనత్, మొహమ్మద్ అలి, ఇజ్రాయేల్ బాబీ, బండి మోహన్, రాకేష్, మోయిన్, సుక్కు చిన్న తదితరులు ఉన్నారు.

Attachments area