పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్

డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి
డోర్నకల్ మండల పద్మశాలి మండల నూతన కమిటీ ప్రకటించింది. మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఏములా వెంకన్న సమక్షంలో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి నూతన మండలాధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి కోదాటి రామారావు,ఉపాద్యక్షుడిగా పారుపల్లి వెంకన్న,ఆకునూరి వెంకన్న,కోశాధికారిగా మాదా శ్రీనివాస్ రావు,గౌరవ అధ్యక్షుడిగా గంజి బద్రయ్య,గౌరవ సలహదారులగా అందె కొమరయ్య,అడేపు మురళి,బండారి మురళి,మాదా నర్సయ్య, మిట్టకొల నాగేశ్వర రావు,పారుపల్లి వీరభద్రం,సంగిశెట్టి వెంకన్నలను కమిటి సభ్యులుగా ఎన్నుకున్నారు.