పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి.
ఎంపీడీవో కథలప్ప..
వీపనగండ్ల19 (జనంసాక్షి)
వీపనగండ్ల మండల పరిధిలోని వల్లభాపూర్ తండాలో మరియు సంగినేనిపల్లి గ్రామాలలో మంగళవారం నాడు స్పెషలాఫీసర్ సుధాకర్ రెడ్డి ఎంపీడీవో కథలప్ప సందర్శించారు
ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి ఎంపీడీవో కథలప్ప మాట్లాడుతూ వల్లభాపూర్ తండాలో క్రీడా ప్రాంగణస్థలం వివాదంలో ఉన్నందున క్షేత్రస్థాయిలో ఆర్ఐ కురుమూర్తి కలిసిసమస్య పరిష్కారానికి రైతులు సహకరించాలని కోరడం జరిగిందని ఎంపీడీవో అన్నారు సంగినేనిపల్లి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాల ఆవరణ జరుగుతున్న కిచెన్ షెడ్డు టాయిలెట్లు రూములు మరియు కాంపౌండ్ నిర్మాణం పనులను స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి పరిశీలించారు పనులను వేగంగా పూర్తి చేయాలని సుధాకర్ రెడ్డి అన్నారు గ్రామంలో పారిశుధ్య పనుల గురించి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి గ్రామాలు పరిశుభ్రంగా  ఉండే  విధంగా చర్యలు తీసుకోవాలని  అంటువ్యాధులు  రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి సూచించారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మౌలాలి వల్లవాపూర్ సర్పంచ్ అంజయ్య ఆర్ఐ కురుమూర్తి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ ఎస్ఎంసి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area