పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

మండలంలోని దేగామ గ్రామానికి చెందిన పలు తెరాస కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గురువారం పరామర్శించారు ఇటీవల మరణించిన బోజారెడ్డి తండ్రి అంగ రాజేశ్వర్ తెరాస మాజీ మండల కన్వీనర్ నానం రమణ తల్లి,లోలం శంకర్ తల్లి కుటుంబాలను అలాగే ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న లోలపు రాజారెడ్డి,హార్ట్ సర్జరీ చేయించుకున్న కేసు శంకర్ కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కానిందే రాజారాం,జనరల్ సెక్రెటరీ శ్రీను, మార్కెట్ కమిటీ చైర్మన్ ,వైస్ చైర్మన్ బోజన్న, భాస్కర్ రెడ్డి,నాయకులు చైతన్య, వినోద్, నరేష్ సర్పంచులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..