పల్లె నుంచి పట్నం దాకా అభివృద్ది నినాదం
కులవృత్తులకు ప్రోత్సాహంతో గ్రామాలకు కళ: సునీత
యాదాద్రి భువనగిరి,జూన్15(జనం సాక్షి ): సీమాంధ్ర పాలనలో కనుమరుగైన కుల వృత్తులకు మళ్లీ జీవం పోసిన ఘనత సిఎం కేసీఆర్ దని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత అన్నారు. కులవృత్తులకు మళ్లీ పూర్వ వైభవం తేవడం ద్వారా సర్కార్ చేయూతనిస్తోందన్నారు. పల్లె నుంచి పట్నం దాక అభివృద్ధి జరగాలన్నదేకేసీఆర్ ఆకాంక్ష అన్నారు. గొల్ల, కురుమలు, నాయిబ్రాహ్మణ, రజక, కమ్మరి, కుమ్మరి, గీత, చేనేత, వడ్రంగా, విశ్వ బ్రాహ్మణుల వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. ఇచ్చిన హావిూలే కాకుండా ప్రజల అభిప్రాయాలను తీసుకుని అ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రతీ పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా దేశంలో నే రైతన్నకు భరోసా ఇచ్చేందుకు వ్యవసాయానికి సాయంగా ఎకరానికి రూ. 4 వేలు అందిస్తున్నది తెలంగాణ సర్కార్ అని గర్వంగా చెప్పారు. సంక్షేమంలో దేశంలోనే కేసీఆర్ నంబర్వన్ నిలువడం తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రజలకు గర్వకారణమని అన్నారు. దీంతో వెలవెల బోయిన గ్రామాలు నేడు మళ్లీ కళకళ లాడనున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కుల, చేతి వృత్తులను బలోపేతం చేస్తే గ్రామాల్లో వలసలను నివారించి ప్రతీ కుటుంబం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని అన్నారు. అందుకే కుల వృత్తుల సంక్షేమం కోసం కోట్లు వెచ్చిస్తున్నారని అన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు, గ్రామాల్లో ఉండే వారికి ప్రోత్సాహం అందించే దిశగా సర్కార్ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే మత్య్సకారుల అభివృద్ధికి ఉచితంగా చేపపిల్లలు అందించడంతో పాటు వారి జోవనోపాధికి ఉపయోగపడేచెరువుల్లోకి గోదావరి జలాలు తెప్పిస్తున్నట్లు తెలిపారు. అందుకే మిషన్కాకతీయ ద్వార చెరువులను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా చేప పిల్లలను పెంచేందుకు చిన్న చిన్న కుంటలు ఏర్పా టు చేయడం జరుగుతుందన్నారు. సీమాంధ్ర పాలనలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, వనరులు దోపిడీకి గురయ్యాయని తెలంగాణ వచ్చాక మన నిధులు, నీళ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మన వారికే అందేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక పనికిరాని ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్ధితుల్లో లేరన్నారు.



