పశువులకు టీకాలు వేసిన వైద్య సిబ్బంది

మల్దకల్ అక్టోబర్ 7 (జనంసాక్షి) మండల కేంద్రంలోని పశు వైద్యశాల దగ్గర శుక్రవారంముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం గురించి మల్దకల్ మండల పశువైద్యధికారి డాక్టర్ వినయ్ కుమార్ లాంఫి వైరస్ సోకినా పశువులు శరీరం పై గుడుపలు,దద్దురులు రావటం,కాళ్లకు వాపులు రావటం,గుడుపలు పగిలి రక్తం కారటం వ్యాధి ముదిరితే పశువు చనిపోవటం జరుగుతుందని రైతులకు వివరించటం జరిగింది.ఈ  కార్యక్రమంలో భాగంగా 776 పశువులకు ఉచ్చితంగా టీకాలు వేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో వి ఎల్ ఓ వెంకటేశ్వర్లు, జెవిఓ రాఘవేందర్,విఏ ర్రాజేంద్ర, సిబ్బంది రామాంజనేయులు, మధు తదితరులు పాల్గొన్నారు.