పాఠశాలకు స్మార్ట్ టీవీ, మైకు అందజేసిన విజేఆర్ ఫౌండేషన్ అధినేత జగన్నాథ్ రెడ్డి

మక్తల్ అక్టోబర్ 13 (జనంసాక్షి) మాగనూర్ మండల పరిధిలోని తాలంకేరి ప్రాథమిక పాఠశాలకు విజేఆర్ ఫౌండేషన్ అధినేత, బిఆర్ఎస్ నేత వర్కటం జగన్నాథ్ రెడ్డి  గురువారం 55000 వేలు విలువచేసే స్మార్ట్ టీవీ మైక్ సెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి విజేఆర్ ఫౌండేషన్ ఎప్పుడు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వర్కటం జగన్నాథ్ రెడ్డి గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ బాలప్ప, వార్డు సభ్యులు తాయప్ప, గ్రామ పెద్దలు బాలప్ప, బసవరాజ్, నర్సింహులు, వాలంటీర్స్ శ్యాంసుందర్, నర్సింలు, అంజప్ప, మహేష్, వెంకటేష్, దేవా, పరశురాం, రాము, బసవరాజ్, అశోక్, రవి, మహిళలు పాల్గొన్నారు.