పాఠశాలలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి

మక్తల్ జూలై 14 (జనంసాక్షి)
మండల కేంద్రంలోని జిపిఎస్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్య అధికారి లియాకత్ అలీ పరిశీలించారు. భారీ వర్షాలకు కురుస్తుండడంతో పాఠశాల స్థితిగతులను పరిశీలించారు పురాతన భవనాలు ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తల పైన ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు మండల కేంద్రంలో మన ఊరు మనబడి కి మొదటి విడుతల ఎంపికైన పాఠశాలను పరిశీలించి పనులు వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర పాఠశాలలతో పోటీపడే విధంగా నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూ పనులు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీడీవో కాలప్ప, ఎంఈఓ విద్యాసాగర్, సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాస్, జిసిడిఓ పద్మ నళిని ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
Attachments area