పార్టీ శ్రేణులు క్రమశిక్షణ ఉల్లంగించరాధు

సహనం పాటించాలి,
శాంతి యుతంగా యేదైనా సాధించవచ్చు.
– కార్యకర్తల అభ్యున్నతికి నేను ఎల్లవేళలా కృషి చేస్తా.
– కార్యకర్తల ఆర్ధికాభివృద్ధికి అధిష్టానం సానుకూలం.

ములుగు జిల్లా బ్యూరో,సెప్టెంబర్ 22 (జనం సాక్షి):-

పార్టీ శ్రేనులు క్రమశిక్షణ ఉల్లంఘించారాదని ములుగు జడ్పీ చైర్మన్,తెరాస జిల్లా అధ్యక్షులు,నియోజక వర్గ ఇంఛార్జి  కుసుమ జగదీశ్వర్ అన్నారు.పార్టీ శ్రేణులు సహనం పాటించాలని,శాంతి యుతంగా ఏదైనా సాధించవచ్చునని, శాంతియుతంగా మన హక్కులను మనం సాధించుకుందామని పార్టీ శ్రేణుల హక్కుల సాధనకు తానూ  ఒక కార్యకర్తగా పార్టీ శ్రేనుల హక్కుల కోసం పోరాడుతానని, పార్టీ శ్రేనుల హార్దిక అభివృద్ధికి అధిష్టానం  సానుకూలంగా ఉందని ములుగు జిల్లా అధ్యక్షులు జెగదీశ్వర్ కార్యకర్తలకు తెలియజేశారు.
Attachments area