పాలస్తీనాపై కొనసాగుతున్న హిజ్రయిల్‌ వైమానిక దాడులు

 

గాజా: పాలస్తీనాపై ఇంకా హిజ్రయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పాలస్తీనాపై హిజ్రాయిల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. మీడియా భవంతులపు కూడా వదలకుండా బాంబుల వర్షం కురిపిస్తుంది. అదివారమిక్కడ మీడియా భవంతిపై ఇజ్రాయిల్‌ జరిపిన వైమానికి దాడిలో సుమారు ఆరుగురు పాత్రీకేయులు గాయపడినట్లు తెలుస్తుంది. ఉత్తర గాజాలో జరిపిన మరోదాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పాలస్తీనా వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక్ష సాక్షులు చెప్పినదాన్ని బట్టి భవనం తీవ్రంగా దెబ్బతింది. తొలి వైమానిక దాడి జరిగిన వెంటనే పాత్రీకేయిలు భవంతిని ఖాఋ చేశారు. అనంతరం కనీసం రెండు దాడులు జరిగాయి. గాజాకు ఉత్తరంగా నివాసాలపై ఇజ్రాయిల్‌ యుద్ద విమానాలు చేపట్టిన వేర్వురు దాడుల్లో ఇద్దరు మరణించారు. పది మంది గాయపడ్డారు. బియత్‌, బియిత్‌ హనున్‌లో ఇళ్లపై జరిగిన రెండు వేర్వురు దాడుల్లో ఇద్దరు యువకులు మరణించారు. పది మంది గాయపడ్డారని సమాచారం.