పాస్‌పోర్టులో సాంకేతిక సమస్య

సెప్టెంబర్‌ 2వరకు సేవల నిలిపివేత
హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): దేశ వ్యాప్తంగా గురువారం నుంచి సెప్టెంబర్‌ 2 వరకు పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్‌పోర్టు సేవలు నిలిచిపోతాయని ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్‌ చేసినట్లు ఆమె వెల్లడిరచారు. దరఖాస్తుదారులకు నేరుగా సంక్షిప్త సమాచారం పంపామని వెల్లడిరచారు. సెప్టెంబర్‌ 2 నుంచి యథావిధిగా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్‌పీవో పేర్కొన్నారు.