పిచ్చికుక్కల దాడిలో 15మందికి గాయాలు

4

వరంగల్‌ : జిల్లాలోని శాయంపేట మండలంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. పిచ్చికుక్కల దాడిలో 15మంది గ్రామస్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 3ఏళ్ల పాప పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. శాయంపేట మండలంలో పిచ్చి కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతో బయటకు రావాలంటేనే భయం వేస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చికుక్కల దాడిలో గాయపడి చికిత్స చేసుకునేందుకు శాయంపేట పీహెచ్‌సీకి బాధితులు పెద్ద ఎత్తున రావడంతో ఆసుపత్రి రోగులతో నిండిపోయింది.