పిచ్చికుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలి

పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈఓకు వినతి
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో పిచ్చి కుక్కలు ఊర్లో కనిపించిన వారిపై దాడులు చేస్తున్నాయని వాటి బారీ నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ శుక్రవారం గ్రామ కార్యదర్శి పులి బాలయ్యకు మెమోరండం సమర్పించారు. ఈసందర్భంగా ఆకునూరు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి పుల్లని వేణు మాట్లాడుతూ.. గ్రామంలో విధి కుక్కలు కనిపించిన పిల్లలు, వృద్ధులపైన దాడులు చేస్తున్నాయని బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పిచ్చి కుక్కల బారీ నుంచి ప్రజలను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆకునూరు పరిరక్షణ సమితి సభ్యులు మధు, శేఖర్, ప్రవీణ్, శశిధర్, నీరజ్, హరీష్, పర్శరాములు, యాదయ్య తదితర యువకులు పాల్గొన్నారు.