పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పి శ్రీనివాస్ ఎన్నిక.

పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర 22వ మహాసభలు నిజామాబాదులో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. నూతన రాష్ట్ర కమిటీ లో భాగంగా పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పి. శ్రీనివాస్ పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రాజేష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతామని, ప్రభుత్వ విద్యను కాపాడడం కోసం, ప్రైవేటు ,కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో మమేకమై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ,రాష్ట్ర విద్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని అదేవిధంగా భగత్ సింగ్, జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్, రంగవల్లి, మారోజు వీరన్న అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మరియు చేవెళ్ల పిడిఎస్ యు నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి, ప్రకాష్, శ్రీకాంత్, జైపాల్, సురేష్, కృష్ణ, గణేష్, గణేష్ రమాకాంత్, మల్లేష్, శివకుమార్, మహేష్, చందు, తదితరులు పాల్గొన్నారు.