పిల్లలకు అందించిన గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి అల్పాహార పథకం.

కలెక్టర్ అనురాగ్ జయంతి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 6. (జనంసాక్షి). సర్కారు బడులలో చదువుతున్న పిల్లలకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం చాలా గొప్పదని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం అల్పాహార పథకం సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించారు. చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో చదువుతున్న చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందేలా ప్రభుత్వం అల్పాహార పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం పూట బడికి వచ్చే పిల్లలకు అల్పాహార పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జింధం కళ, పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు