పీఆర్సీ అమలుతో గోపాల మిత్రల హర్షం

సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మహబుబ్ నగర్ అర్ సి ,అక్టోబరు 8,(జనంసాక్షి )
 గోపాల మిత్రలకు తెలంగాణ సర్కారు దసరా కానుకను ఇచ్చి అమలు చేయడంతో గోపాల మిత్రలు హర్షం వ్యక్తం చెశారు . పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  దసరా కానుకగా  ప్రకటించారు. శనివారం గోపాలమిత్ర సంఘం  జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో   సీఎం కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చెశారు. ఈ సందర్బంగా గోపాల మిత్రల సంఘం   జిల్లా  అద్యక్షుడు రాములు  మాట్లాడుతూ …తమ సమస్యలను అర్ధం చేసుకుని పరిష్కరించి 30 శాతం పీఆర్సీని అమలు చేసినందుకు సీఎం కేసీఆర్ మరియు మంత్రులు శ్రీనివాస్ యాదవ్,హరిశ్ రావులకు కృతజ్ఞతలు  తెలిపారు .కార్యక్రమంలో గోపాల మిత్రల సంఘం   జిల్లా  అద్యక్షుడు రాములు ,ఉపాద్యక్షుడు వీరయ్య ,గోపాల మిత్ర హాజి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు .
Attachments area