పీఆర్సీ  నియామకం

` కమిటీ చైర్మన్‌ గా ఎన్‌. శివశంకర్‌,సభ్యుడిగా బి. రామయ్య
` ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపుకోసం పే రివిజన్‌ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌ గా ఎన్‌. శివశంకర్‌ (రిటైర్డ్‌ ఐఎఎస్‌) ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్‌ ఐఎఎస్‌) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీ కి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్‌ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5 శాతం మధ్యంతర భృతి (ఐ ఆర్‌ ) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.