పీర్జాదిగూడలో కన్నుల పండువగా బోనాలు

అంగరంగ వైభవంగా 3వ సారి ఫలహారం బండి తీసిన తుంగతుర్తి రవి
పాల్గొన్న అద్దెంకి దయాకర్, నందికంటి శ్రీధర్, మేడ్చల్ జిల్లా నేతల హాజరు
మేడిపల్లి – జనంసాక్షి
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఆదివారం నాడు రాత్రి బంగారు మైసమ్మ బోనాల జాతర సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో మూడవసారి ఫలహార బండి తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, నేతలు అద్దంకి దయాకర్ కుటుంబ సమేతంగా, తోటకూర వజ్రేష్ యాదవ్, సామల కిరణ్ రెడ్డి  తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులకు తుంగతుర్తి రవి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఈ బంగారు మైసమ్మ తల్లి బోనాల సందర్భంగా అమ్మవారి కటాక్షంతో 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి కరోనా నుండి ఇప్పటి వరకు కేవలం ప్రజల కోసమే పని చేస్తున్నారని అన్నారు. రవికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవి మాట్లాడుతూ బంగారు బోనాల సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆనుగ్రహంతో యావత్ ప్రపంచ నిరుపేద ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు కలిగి విరజిల్లాలని, కరోనా, ఫ్లడ్స్ తదితర మాయదారి రోగాలు రాకుండా కాపాడలని కోరుకున్నట్లు తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ప్రత్యేకంగా కోరారు. ప్రజలకు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ ఉందని, యువత సమస్యలపై పోరాటం చేయలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, మున్సిపల్ కార్పోరేషన్ నేతలు, కార్యకర్తలు అనేక ప్రజానీకం యువత మహిళలు, పీర్జాదిగూడ ప్రజలు తదితరులు హాజరయ్యారు.
Attachments area