పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య
మహబూబ్నగర్: కొందుర్గ్ మండలం పీర్జాపూర్లో పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.