పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక…

కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి /స్థానిక జడ్పీ హైస్కూల్లో 1994-95 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు.28 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న మిత్రులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.పరస్పరం ఆర్ధికంగా సహకరించుకునేందుకు పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ఇదే బ్యాచ్ కు చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్)ఎసల్ల అప్పయ్య,మడూరి దినేష్, మండల లింగమూర్తి సహకారం అందించారు. కార్యక్రమంలో 1994-95 క్లాస్ మేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడూరి దినేష్, ప్రధాన కార్యదర్శి బండారు మధు, కోశాధికారి మిడతనపల్లి ప్రకాశ్,మండల లింగమూర్తి, చిట్యాల వీరన్న,బాణాల రఘు,ముంజ బిక్షపతి, రాపాక కిరణ్,పురం రమేష్,సోలాపురపు యాకూబ్ రెడ్డి,జంజిరాల ప్రభాకర్,కోసల జవహర్ లాల్,గోపాల వెంకట్ రెడ్డి,తాళ్ళపెల్లి విద్యాసాగర్, పీమా, బానోతు బాలు, తోడేటి మల్లేశం, వచ్చాల సాంబయ్య, మారగాని సత్యనారాయణ‌ తదితరులు పాల్గొన్నారు.