పెద్దవార్వాల్ ప్రీమియర్ లీగ్-5 విజేతగా కింగ్స్ జట్టు

మహబుబ్ నగర్ అర్ సి, అక్టోబర్ 8 (జనంసాక్షి ) :
గండీడ్ మండల పరిధిలోని  పెద్దవార్వాల్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా ప్రతియేటా నిర్వహించే పిపిఎల్ లో ఈ సారీ విజేతగా వార్వాల్ కింగ్స్ జట్టు విన్నర్ గ నిలువగా  11 బ్లాస్టర్స్ జట్టు రన్నర్ ఆఫ్ గా నిలిచింది . ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేసించి వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ మాట్లాడుతూ…గెలుపు,ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. అనంతరం టోర్నమెంట్‌ లో గెలుపొందిన జట్టులకు  ప్రైజ్ మనీ,బహుమతులు ప్రధానం చేశారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత చిన్నారెడ్డి,వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నరసింహారావు, సింగిల్ విండో డైరెక్టర్ వి. బాలస్వామి,YSRTP పరిగి కో ఆర్డినేటర్ గౌస్ పాషా , జే.వీరన్న, వార్డు మెంబర్ పి.నర్సింహులు,పీపీఎల్ అధ్యక్షులు చాకలి వెంకటేష్, ఉపాధ్యక్షులు ప్రశాంత్,ప్రకాష్,గ్రామ ప్రజలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area