పెద్ద ఆనందం కుటుంబానికి పరామర్శ

 సంతాపం తెలుపుతున్న ఎంపీపీ నెమ్మాది బిక్షం
 పెన్ పహాడ్. అక్టోబర్ 08 (జనం సాక్షి) : మండల పరిధిలోని అన్నారం బ్రిడ్జి గ్రామానికి చెందిన పొడపంగి పెద్ద  ఆనందం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన చిత్రపటానికి ఎంపీపీ నెమ్మది బిక్షం పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పెద్ద ఆనందం లేని లోటు కుటుంబానికి పార్టీకి తీర నీ లోటని ఆయన అన్నారు అనంతరం కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీసాల రమణ దేవయ్య, మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి యుగేందర్, పిఎసిఎస్ చైర్మన్ నాతాల జానకిరామ్ రెడ్డి మాజీ సర్పంచ్ మీసాల లచ్చయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఒగ్గు సోమన్న, టిఆర్ఎస్ నాయకులు  మురళి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల లింగయ్య, నాయకులు కొండ జానకి రాములు మామిడి నాగయ్య రాయలి శ్రీనివాస్ ముదిగొండ వీరస్వామి, పొడపంగి సామేలు ,పొడపంగి ప్రసాద్, పొడపంగి సునీల్, మీసాల ప్రశాంత్ ,మీసాల నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.