పెద్ద గుండవెల్లి గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించుట
దుబ్బాక జనం సాక్షి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు గ్రామ స్వచ్ఛత పరిశుభ్రత పాటించాలని దీనిలో భాగంగా 100 గంటల కార్యక్రమం మరియు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచటం అంగన్వాడి సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండు ,రోడ్ల వెంబడి ఎక్కడ గడ్డి లేకుండా చూడడం స్వచ్ఛతగా పరిశుభ్రంగా ఉంటే రోగాల బారిని పడకుండా కాపాడుతుందనినెహ్రూ కేంద్రం అధికారి కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రతి సెకండ్ ప్రతి నిమిషం పరిశుభ్రమైన వాతావరణంలో గ్రామ ప్రజలు విద్యార్థుల యువకులు అలవర్చుకోవాలని కిరణ్ కుమార్ సూచించారు బాయికాడ లక్ష్మణ్ పరికి చింటూ, రాజు వేల్పుల ,విజయ్ కుమార్, మహేష్,రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
