పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉపాధ్యాయులు నిరసన
ఝరాసంగం సెప్టెంబర్ 1 (జనం సాక్షి): ఉపాధ్యాయ యూనియన్ ల రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మండలం లోని ఝరాసంగం, చిలపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం ఉపాధ్యాయులు రాంచందర్ భీంవంశీ, జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి,బసప్ప, రత్నయ్య, నాగన్న, ఐజాక్, సుమలత ప్రమీల చిలపల్లి లో అమృత్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.