పెళ్లి కొడుకు మోసం చేశాడని పెళ్లి అడ్డుకున్న యువతి
ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఓ యువతి ఏకంగా పెళ్లి పీటల మీద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకుంది. క్యాతన పల్లి మున్సిపాలిటీ గద్దె రాగడి ప్రాంతంలోని భీమా గార్డెన్స్ లో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు గుళ్ళ రమినా తెలిపిన వివరాల ప్రకారం వివాహం చేసుకుంటున్న రాజేష్(రాజు) తో నాలుగు సంవత్సరాల పాటు పరిచయం ఏర్పడిందని, హన్మకొండలో ఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమిస్తున్నానని చెప్పి హన్మకొండకు వచ్చి యాదగిరి గుట్టకు తీసుకువెళ్లి శారీరకంగా వాడుకున్నాడని, రాజేష్ వివాహం చేసుకుంటున్న విషయం ఇతరుల ద్వారా తెలిసిందని,వివాహం జరుగుతున్న విషయాన్ని చెప్పకుండా నిన్నటి వరకు చాటింగ్ చేశాడని, వాళ్ళ బంధువులు వాట్సప్ లో పెట్టుకున్న స్టేటస్ చూసి పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ కు వచ్చి వివాహాన్ని ఆపేందుకు ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ సమయంలో యువతి వద్ద ఫోన్ లో ఉన్న ఆధారాలను పెళ్లి వధువుబ తరపు బంధువులకు చూపిస్తున్న సమయంలో ఫోన్ తీసుకొని రాజేష్ వాళ్ళ అమ్మ , నాన్న, సోదరుడు వచ్చి దాడి చేశారన్నారు. ఫంక్షన్ హాల్ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళుతున్న క్రమంలో రెండు మూడు సార్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారనీ తెలిపింది. రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో బొద్దుల రాజేష్ తో వివాహం జరిపించాలని, లేకపోతే చనిపోతానని ఎస్సై అశోక్ యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్.ఐ. అశోక్ తెలిపారు.