పేదల అభివృద్ధి కేసీఆర్ ఆశయం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 2:: పేదల అభివృద్ధి కేసీఆర్ ఆశయమని పేదలకు కోసం దేశంలో ఎక్కడా అమలు చేయని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత కేసిఆర్ కి దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు  మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు  రెండు కోట్లు వ్యయంతో నిర్మించనున్న పిహెచ్సి భవనానికి శంకుస్థాపన చేశారు .50 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతోపాటు 15 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ  భవనానికి శంకుస్థాపన చేశారు. 20 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. అనంతరం  ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 584 మంది నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేశారు.
.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్  ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్లు ప్రతిమసింగ్,రమేష్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి రాష్ట్ర సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి పి ఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఎంపీపీ పురం నవనీయత రవి గ్రంథాలయ చైర్మన్ చంద్రారెడ్డి ఆత్మ చైర్మన్ వెంకట్ రెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పురం మహేష్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మండల వైస్ చైర్మన్ విట్టల్ రెడ్డి నాయకులు చంద్రశేఖర్ బిక్షపతి నరేష్ రాహుల్ రెడ్డి మల్లేష్ బాలకృష్ణ మల్లేష్ నర్సింలు శ్రీహరి జావేద్ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు