పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా.

-బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఫోటో రైటప్: సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులతో ఎమ్మెల్యే చిన్నయ్య.
బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి)
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని 75 మంది లబ్దిదారులకు ₹ 24,15,280 చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గరిబోళ్లకు అండగా ఉంటాడని దీనికి నిదర్శనంగా ఒకేసారి 75 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించమే అన్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవాలు జరుపుకునే సందర్భంగా తనకు ఒకేసారి 75 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయడం తన అదృష్టం అన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.