పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మక్తల్ జూలై 09 (జనంసాక్షి) బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మక్తల్ పట్టణంలోని ఆయన నివాసంలో ఉట్కూరు మండలము బిజ్వార్ గ్రామానికి చెందిన నరసింహకు రూ.60 వేల చెక్కును ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు