పైసల్లో జోరు…. సౌకర్యాల్లో బేజారు…

   బోథ్ (జనంసాక్షి)     పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది 44వ నెంబర్ జాతీయ రహదారి పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలలో రోడ్డును వెతుక్కనే పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ నుండి ఆదిలాబాద్ మార్గ మధ్యలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీనికి తోడు విహనదారుడు గుంతను తప్పించె క్రమంలో ఏ పక్కకు తీరిగినా ర్యాష్ డ్రైవింగ్ పేరుతో చలాన్ క్షణాల్లో ఫోన్ లో మేసేజ్ రూపంలో వాత పడుతుంది. టోల్ రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న సదరు కంపెనీలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. ఈ గుంతల నిత్యం రాత్రి వేళల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంలో సదరు కంపెనీ తో మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.