పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం
జహీరాబాద్ ఆగస్టు 7 (జనంసాక్షి ) ఎమ్మార్పీఎస్.పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం అని జహీరాబాద్ ఎమ్మార్పియస్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ అన్నారు. ఆదివారం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో ఆరోగ్య శ్రీ సాధన దినోత్సవం నిర్వహించారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మార్పియస్ సంగారెడ్డి జిల్లా కో-ఇంచార్జ్ మాతంగి చిరంజీవి మాదిగ మాట్లాడుతూ ఆనాడు ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గుండెజబ్బు పిల్లలకోసం చేసిన పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఆరోగ్య శ్రీ పథకమన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ మాట్లాడుతూ ఆనాడు ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం రావడానికి ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో మందాకృష్ణ మాదిగ చేసిన పోరాటమనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టి.పి.సి.సి నాయకులు నరోత్తం, ఎం.ఇ.ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాంచందర్,
బి.ఎస్.పి జహీరాబాద్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పద్మారావు, నాయకులు జయరాజు,ఎం.ఎస్.పి జహీరాబాద్ నియోజకవర్గ
ఎంజె.ఎఫ్ జిల్లా నాయకులు రాజీవ్ మీదిదొడ్డి, ఎమ్మార్పియస్ నాయకులు ప్రేంరాజ్, సంపత్, నర్సిములు, టింకు, సుకుమార్, జనార్థన్, డెవిడ్, సురేష్, మధు, మాస్టర్ హర్షిత్ నోహెల్, ఆనిల్ తదితరులు పాల్గొన్నారు.