పోలీసుల ముమ్మర తనిఖీలు

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇందులో భాగంగా వాజేడు, పేరూరు పోలీసులు మండలంలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నెల 28 తేదీ నుంచి ఆగస్టు 3తేదీ వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యం లో పేరూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దూ ప్రాంతమైన టేకులగూడెం 163 జాతీయ రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతోపా టు బొగత జలపాతం, పలు ప్రదేశాలకు వెళ్లే బైక్‌లు, కార్లు నిలిపి బ్యాగులు సోదాలు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. సరిహద్దూ ప్రాంతం పోలీసుస్టేషన్‌ కావడంతో పోలీసులు అప్రమత్తం ఉండి తనిఖీలను ముమ్మరం చేశారు.