పోషణ మాసం సందర్భంగా అవగాహన సదస్సు
బోనకల్: బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలోనీ అంగన్వాడీ కేంద్రంలో సమతుల్య ఆహారం ఆకుకూరల ప్రాధాన్యత గురించి పిల్లల సంరక్షణ పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతలు గురించి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కంకణాల సౌభాగ్యం అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర సిడిపిఓ శారద శాంతి పాల్గొని పిల్లలు, తల్లులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. మండలంలోని కలకోట గ్రామపంచాయతీలో శనివారము అంగన్ వాడి 1 సెంటర్ నందు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పోషణ మాసం సందర్భంగా గర్భిణీ స్త్రీలు, తల్లులు, వికలాంగ బాలికలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తూ తల్లులకు మీటింగ్ నిర్వహించారు. తల్లిపాలు శ్రేష్టమైనవని తల్లిపాలలోనే పోషక విలువలు ఉంటాయని పిల్లలకు సమతుల్యత గల ఆహారమును అందించడం ద్వారా బలంగా దృఢంగా ఉంటారని మానసిక వికాసము అభివృద్ధి చెందుతుందని సిడిపిఓ శారద శాంతి అన్నారు.కిషోర్ బాలికలు వితంతువులు గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. బరువు తక్కువ గల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏసీడీపీఓ కమల ప్రియ వివరించారు. సీజనల్గా సంక్రమించే వ్యాధులు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హ్యాండ్ వాష్ తదితర అలవాట్లను నేర్పించాలని గ్రామపల్లె దవాఖాన డాక్టర్ పేర్కొన్నారు, గ్రామ సర్పంచ్ యంగల దయామణి మాట్లాడుతూ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెప్పిన సలహాలను సూచనలు పాటించాలని ఆమె కోరారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సర్పంచ్ యంగల దయామణి, సిడిపిఓ శారద శాంతి, ఏసీడీపీఓ కమల ప్రియ సూపర్వైజర్ రమాదేవి, సెక్రెటరీ బి లక్ష్మి, పల్లె దవాఖాన డాక్టర్, అంగన్వాడీలు ప్రసాద్ భాయి, నరసమ్మ యాకూబీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పలువురు తల్లులు పాల్గొన్నారు.