ప్యాలరంలో వాగు వస్తే అంతే
ఝరాసంగం జులై 23( జనంసాక్షి) మండలంలోని ప్యారవరం గ్రామంలో వర్షం వచ్చి వాగు వస్తే అంతే ఎక్కడి వాలు అక్కడే అగవలసిందే శనివారంపొంగి పొర్లుతున్నందున అట్టి వాగును జిల్లా అధికారి ,మండల అధికారులు పరిశీలించారు. గ్రామప్రజలు జిల్లా మండల అధికారులకు మాకు ఎలాగైనా సమష్యను పరిష్కరించండి ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బ్రతుకున్నాము మాకు ఆరోగ్య సమస్యలు వచ్చినా, గర్భవతి మహిళలు ప్రసవం కోసం వెళ్లాలన్న వాగు వస్తే వెళ్లే పరిస్థితి లేదని ఎలాగైనా శాశ్వత పరిష్కారం చేయగలరని అధికారులకు గ్రామప్రజలు మొరపెట్టుకున్నారు కార్యక్రమంలో సర్పంచ్ సంజీవమ్మ మణేయ్య, ఉపసర్పంచ్ మాణిక్యం, జిల్లా అడిషినల్ పీడీ జయదేవ్, తహసీల్దార్ తారసింగ్ ఎస్ ఐ రాజేందర్ రెడ్డి ఎంపీడీఓ సుజాత ,,ఏపీఓ రాజ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, గ్రామప్రజలు పాల్గొన్నారు