ప్రకృతి ని ప్రతీ ఒక్కరు పరిరక్షించాలి.బి.వెంకట్

  నిర్మల్ బ్యూరో, జులై 28,జనంసాక్షి,,   ప్రకృతిని పరిశీలించాలని సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు ,నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, పద్యకవి బి వెంకట్ అన్నారు. సమితి ఆధ్వర్యములో *ప్రపంచ పరిరక్షణ దినోత్సవ* కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచభూతాల పరమార్థాన్ని తెలుసుకోవాలన్నారు. అద్భుతమైన ప్రపంచాన్ని ఆ పరబ్రహ్మ సృష్టించారని అన్నారు .కోట్ల కొలది జీవాలు జీవ వైవిద్యముతో జీవన మనుగడ సాగిస్తున్నాయని, సుందరమైన ఈ ప్రకృతిని ప్రతి మానవుడు పరిరక్షించాలని, అన్నారు. ఈ సందర్భముగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న *సంస్కృతభారతి బాలికలు పూల మొక్కలను నాటి నీళ్లను పోశారు.తెలంగాణరాష్ట్ర గురుకుల బాలికల విద్యాలయము జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నీరడి గంగాశంకర్, వ్యాయామ ఉపాధ్యాయుడు జాదవ్ గణేశ్. బాలికలు తదితరులు పాల్గొన్నారు,
Attachments area